Nagarjuna: హైదరాబాదులో పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున... ఫొటోలు ఇవిగో!

  • జూబ్లీహిల్స్ సొసైటీ పార్కుకు శంకుస్థాపన
  • మొక్కలు కూడా నాటిన నాగార్జున
  • కాలనీ వాసులకు అభినందనలు
  • మరిన్ని మొక్కలు నాటాలంటూ సూచన
Nagarjuna laid foundation for a park in Hyderabad

టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున హైదరాబాదులో ఓ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో సందడి చేశారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్ సొసైటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.49లో కొన్ని మొక్కలు కూడా నాటారు. ఈ కార్యక్రమంలో వాల్గో ఇన్ ఫ్రా ఎండీ, సీఈవో శ్రీధర్ రావు, నాగ్ స్నేహితుడు సతీశ్ రెడ్డి, అశోక్ బాబు, స్థానిక కాలనీవాసులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగ్ స్థానికులతో మాట్లాడుతూ, వారిలో సామాజిక చైతన్యం పెంపొందించే ప్రయత్నం చేశారు. పర్యావరణ హితం కోరి మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అక్కడివాళ్లు చెట్లు పెంచుతున్న వైనాన్ని అభినందించారు. నాగ్ ఈ సందర్భంగా ఓ చిన్నారిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని పిల్లలపై తన ప్రేమను చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

More Telugu News