SEC: ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఏపీ ఎన్నికల సంఘం సమావేశం

  • కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలు
  • ఇప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
  • సాధారణ ప్రక్రియలో భాగంగానే సమావేశమన్న ఎస్ఈసీ  
SEC will meet all parties to discuss local body elections

సరిగ్గా భారత్ లో కరోనా వ్యాప్తి ఊపందుకున్న సమయంలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో ఆ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కేంద్రం అన్ లాక్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల సంఘం దృష్టి సారించింది.

ఈమేరకు అన్ని రాజకీయ పార్టీలతో ఈ నెల 28న ఏపీ ఎన్నికల సంఘం సమావేశం అవుతోంది. స్థానిక ఎన్నికలపై ఈ సమావేశంలో ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ ప్రకటన జారీ చేశారు. ఈ సమావేశాన్ని సాధారణ ప్రక్రియలో భాగంగానే నిర్వహిస్తున్నామని, కరోనా జాగ్రత్తలు తీసుకుని సమావేశం నిర్వహిస్తామని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని తెలిపారు.

More Telugu News