Chittoor District: కరోనా బారినపడిన వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

  • ఏపీలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు
  • తనకు వైరస్ సోకినట్టు వెల్లడించిన తిరుపతి ఎమ్మెల్యే
  • లక్షణాలు పెద్దగా లేవన్న కరుణాకర్‌రెడ్డి
Tirupati ycp MLA Bhumana tested corona positive

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కొవిడ్ బారినపడ్డారు. తాజాగా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి కరోనా వైరస్ సంక్రమించింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను కొవిడ్ పరీక్ష చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. అయితే, లక్షణాలు పెద్దగా లేవని, చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిపారు.

More Telugu News