Devineni Uma: ఈ మాటలు తాడేపల్లి రాజప్రాసాదానికి వినబడుతున్నాయా.. జగన్ గారు?: దేవినేని ఉమ

  • రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు వ్యాఖ్యలను గుర్తు చేసిన దేవినేని
  • నిర్మాణాలు నిలిచిపోతే అయ్యే వృథాకు బాధ్యులెవరు?
  • ప్రజా రాజధానికి ఇప్పటివరకు పెట్టిన ఖర్చెంత?
  •  ఆ సొమ్మంతా ప్రజలదే, ఖజానాకు నష్టమే
devineni fires on ycp

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన పోస్ట్ చేశారు. 'నిర్మాణాలు నిలిచిపోతే అయ్యే వృథాకు బాధ్యులెవరు? ప్రజా రాజధానికి ఇప్పటివరకు పెట్టిన ఖర్చెంత?  ఆ సొమ్మంతా ప్రజలదే, ఖజానాకు నష్టమే. ప్రజాధనం వృథా అవుతుంటే చూస్తూ ఉండలేం. ఎలా రాబట్టాలో తర్వాతి విచారణలో తేలుస్తాం. ఈ మాటలు తాడేపల్లి రాజప్రాసాదానికి వినబడుతున్నాయా? జగన్ గారు' అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.
 

More Telugu News