Somireddy Chandra Mohan Reddy: విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించకపోతే జరగబోయే పరిణామాలకు మేం బాధ్యులం కాదు: సోమిరెడ్డి హెచ్చరిక

  • కావలిలో ఎన్టీఆర్ విగ్రహ కూల్చివేత
  • సీఎం వైఎస్ జగన్ స్పందించాలి
  • ఇది మంచి సంప్రదాయం కాదు
  • కొవిడ్ కారణంగానే ఎన్టీఆర్ అభిమానుల మౌనం
somireddy fires on ysrcp

నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం ముసునూరులో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. చాలా ఏళ్ల కిందట స్థానికులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న ఈ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

'కావలిలో ఎన్టీఆర్ విగ్రహ కూల్చివేతపై సీఎం వైఎస్ జగన్  స్పందించాలి. ఇది మంచి సంప్రదాయం కాదు. విగ్రహాన్ని పునఃప్రతిష్టించండి. ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. కొవిడ్ కారణంగానే ఎన్టీఆర్ అభిమానులు మౌనంగా ఉన్నారు. విగ్రహాన్ని యథాతథంగా ప్రతిష్టించకపోతే జరగబోయే పరిణామాలకు మేం బాధ్యులం కాదు' అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.

More Telugu News