Anushka Shetty: మరో చిత్రానికి ఓకే చెప్పిన అనుష్క!

  • 'బాహుబలి' తర్వాత తగ్గిన అనుష్క క్రేజ్ 
  • థియేటర్ల మూసివేతతో విడుదల కాని 'నిశ్శబ్దం'
  • విజయ్ సేతుపతి చిత్రానికి గ్రీన్ సిగ్నల్  
Anushka gives nod for a Tamil movie

ఒకప్పుడు నెంబర్ వన్ కథానాయికగా పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా కనిపించిన అనుష్క, ఇటీవలి కాలంలో కొత్త హీరోయిన్ల రాకతో వెనుకపడింది. 'బాహుబలి' తర్వాత ఆమె చేసిన చిత్రాలు ఏమాత్రం ఆడకపోవడంతో ఆమె క్రేజ్ బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన 'నిశ్శబ్దం' చిత్రం పూర్తయినా కూడా, థియేటర్లు మూతబడడం కారణంగా ఇంకా విడుదలకు నోచుకోలేదు.

దీంతో ఆమె ఇక పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతుందంటూ ఈమధ్య వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అనుష్క తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె కథానాయికగా నటించనుందని అంటున్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. గతంలో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో అనుష్క రెండు సినిమాలు చేసింది. ఆ పరిచయం కారణంగానే ఈ చిత్రానికి ఆమె ఓకే చెప్పిందని సమాచారం.  

More Telugu News