Dil Raju: పెళ్లయిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమల వచ్చిన దిల్ రాజు దంపతులు

  • మే 10న దిల్ రాజు, తేజస్విని వివాహం
  • లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో శ్రీవారి దర్శనానికి రాక
  • తిరుమలలో దిల్ రాజును గుర్తించిన అభిమానులు
Dil Raju and wife visited Tirumala first time after wedding

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇటీవల తేజస్విని అనే యువతిని పెళ్లాడారు. మే 10న వీరి వివాహం అతికొద్దిమంది నడుమ జరిగింది. ఆ సమయంలో లాక్ డౌన్ ఉండడంతో వారు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో తొలిసారి తిరుమల వచ్చారు. పెళ్లయిన తర్వాత ఓ పబ్లిక్ ప్లేసులో వీరిద్దరూ కనిపించడం ఇదే ప్రథమం. శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయం వెలుపలికి రాగానే మీడియా కెమెరాలు క్లిక్ మన్నాయి. దిల్ రాజును గుర్తించిన అభిమానులు అక్కడికి పరుగులు తీశారు. ఈ సందర్భంగా తమ మాస్కులు తొలగించిన దిల్ రాజు, తేజస్విని ఫొటోలకు పోజులిచ్చారు.


More Telugu News