Budda Venkanna: ఇప్పుడు ఆయన కన్ను పాదయాత్రలో చూసిన మాన్సాస్ ట్రస్ట్ భూములపై పడింది: బుద్ధా వెంకన్న

  • పంచభూతాలను దోచుకోవడం జగన్ నైజం
  • మాన్సాస్ ట్రస్టును భ్రష్టు పట్టించడమే లక్ష్యం  
  • అవినీతి అనే పదంతో పరిచయంలేని వ్యక్తి అశోక్ గజపతి రాజు 
  • ఆయనపై ఆరోపణ చేసే సాహసం చేసిన మొదటి వ్యక్తి మీరే సాయిరెడ్డి 
budda venkanna criticises vijay sai reddy and jagan

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'ప్ర‌కాశం బ్యారెజి గేటుకి అడ్డంగా బోటుప‌డితే తీయ‌లేనోళ్లు, తాము గేటు తీస్తే టీడీపీ ఖాళీ అంటున్నారు. వైఎస్సార్సీపీ గేటు ఒక్క‌సారి తీయండి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వ‌రకూ వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంత‌మంది జంప్ అవుతారో చూడండి.
 
'పంచభూతాలను దోచుకోవడం జగన్ నైజం. ఇప్పుడు ఆయన కన్ను పాదయాత్రలో చూసిన మాన్సాస్ ట్రస్ట్ భూముల పై పడింది. రాజధాని పేరుతో విజయసాయిరెడ్డి  డైరెక్షన్ లో మాన్సాస్ ట్రస్టును బ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కుట్రకి తెరలేపారు' అని ఆరోపించారు.
 
'అవినీతి అనే పదంతో పరిచయంలేని వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఇప్పటి వరకూ ఆయనపై ఆరోపణ చేసే సాహసం చేసిన మొదటి వ్యక్తి మీరే సాయి రెడ్డి గారు. మీరు వేలు పెట్టే వరకూ మాన్సాస్ ట్రస్ట్ లో ఒక్క వివాదం కూడా లేదు.. అదీ అశోక్ గజపతి రాజు గారి విశ్వసనీయత' అని చెప్పారు.

'సమాధానం కోసం ఎదురు చూసే దౌర్భాగ్యం మీకు ఎందుకు? అధికారంలో ఉన్నది మీరే ఆరోపణలు కాదు దమ్ముంటే  ఆధారాలు బయటపెట్టండి' అని సవాలు విసిరారు.

More Telugu News