Telugudesam: వైసీపీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారంపై స్పష్టతనిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు

  • నేను పార్టీ మారడం లేదు
  • పార్టీ మార్పుపై ఎవరితోనూ చర్చించలేదు 
  • నాపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు
  • నాపై కావాలనే కొందరు బురద చల్లుతున్నారు 
tdp mla on joining ycp

పర్చూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత సాంబశివరావు  వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేగాక, పార్టీ మార్పుపై ఈ రోజు ఆయన ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు తెలిపారు. దీనిపై స్పందించిన సాంబశివరావు తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మార్పుపై ఎవరితోనూ చర్చించలేదని,  ఆ అవసరం కూడా తనకు లేదని చెప్పారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

తన అనుచరులతో మార్టూరులో ఆయన ఈ రోజు సమావేశమయ్యారు. కొందరు తనపై కావాలనే బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను తెలుగు దేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా, ఈ రోజు ఉదయం ఆయన తన  అనుచరులతో పర్చూరులో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News