చినజీయర్ స్వామితో కలిసి అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కొండపోచమ్మ సాగర్ కు గోదావరి జలాలు
- మర్కుక్ పంప్ హౌస్ మోటార్లు ప్రారంభం
- గోదావరి నదికి హారతి ఇచ్చిన సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గోదావరి నదీమాతకు జలహారతి ఇచ్చారు. కాగా, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుతో ఐదు జిల్లాలకు జల వనరులు సమకూరనున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యం దీని సొంతం. ఈ ప్రాజెక్టుతో 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాదు, హైదరాబాదు నగరానికి సైతం తాగు నీరు సరఫరా చేయొచ్చు.