Junior NTR: ఎన్టీఆర్ తో వంశీ పైడిపల్లి .. 'బృందావనం' సీక్వెల్?

  • మహేశ్ తో పట్టాలెక్కని ప్రాజెక్టు
  •  ఎన్టీఆర్ కోసం కథపై కసరత్తు
  • గతంలో హిట్ కొట్టిన 'బృందావనం'
Vamsi paidipalli Movie

తెలుగులో కథాకథనాలపై మంచి పట్టు వున్న దర్శకుల జాబితాలో వంశీ పైడిపల్లి ఒకరుగా కనిపిస్తాడు. మహేశ్ బాబుకి 'మహర్షి' వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి, ఆయనతోనే మరో ప్రాజెక్టును ప్లాన్ చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ కథ పట్టాలెక్కలేదు. దాంతో ఆ కథను పక్కన పెట్టేసిన వంశీ పైడిపల్లి, ఎన్టీఆర్ తో 'బృందావనం' సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు.

ఎన్టీఆర్ .. సమంత .. కాజల్ ప్రధాన పాత్రధారులుగా వంశీ పైడిపల్లి చేసిన 'బృందావనం' 2010లో భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను వంశీ పైడిపల్లి సిద్ధం చేయడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. త్వరలోనే ఆయన ఎన్టీఆర్ కి ఆ కథను వినిపించనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా తరువాత వంశీ పైడిపల్లితో ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళతాడేమో చూడాలి మరి.

More Telugu News