Prabhas: 'కేజీఎఫ్' దర్శకుడితో ప్రభాస్ సినిమా ఖాయమైనట్టే!

  • రాధాకృష్ణకుమార్ తో తాజా చిత్రం
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ భారీ చిత్రం
  • లైన్లో దర్శకుడు ప్రశాంత్ నీల్  
Prashanth Neel Movie

'బాహుబలి' నుంచి ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తరువాత కూడా ఆయన సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మితమవుతోంది. ఆ తరువాత నాగ్ అశ్విన్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై చేయనున్న సినిమా కూడా అంతే. భారీ బడ్జెట్ .. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందనుంది.

ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో కలిసి ప్రభాస్ సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. 'కేజీఎఫ్' సినిమాతో పాప్యులర్ అయిన ప్రశాంత్ నీల్, ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. అది పూర్తయిన తరువాత ప్రభాస్ స్క్రిప్ట్ పై కూర్చుంటాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News