Amarraj Batteries: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు అమర్ రాజా గ్రూప్ రూ.5 కోట్లు విరాళం

  • ‘కరోనా’ కట్టడికి  చేస్తున్న పోరాటానికి మద్దతు 
  • రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చిన అమర్ రాజా గ్రూప్
  • ఓ ట్వీట్ ద్వారా తెలియజేసిన ఎంపీ గల్లా జయదేవ్
Amarraja Group Donation to AP CM Relief Fund

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక పోరాటానికి అమర్ రాజా గ్రూప్స్ తమ వంతు విరాళాన్ని అందజేసింది. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఓ ట్వీట్ చేశారు. ‘కరోనా’ కట్టడికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి  అమర్ రాజా గ్రూప్ మద్దతుగా నిలుస్తూ రూ.5 కోట్ల చెక్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఈ గ్రూప్ సీఈఓ అందజేశారని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

More Telugu News