Anupama: కరోనాపై పోరాటానికి సత్య నాదెళ్ల అర్ధాంగి భారీ విరాళం

  • ప్రపంచదేశాల్లో కరోనా బీభత్సం
  • వైరస్ నివారణపై తీవ్ర పోరాటం సాగిస్తున్న ప్రభుత్వాలు
  • తెలంగాణ ప్రభుత్వానికి రూ.2 కోట్ల విరాళం అందించిన అనుపమ
Microsoft CEO Satya Nadella wife Anupama donates to anti corona battle

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కరోనా వైరస్ భూతం హడలెత్తిస్తోంది. అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్ మహమ్మారితో అలుపెరుగని పోరాటం సాగిస్తున్నాయి. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేనందున నివారణే అత్యుత్తమ చికిత్స అని అందరి అభిప్రాయం. ఈ క్రమంలో కరోనాపై పోరాటానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్ధాంగి అనుపమ భారీ విరాళంతో ముందుకొచ్చారు. కరోనా నివారణకు అనుపమ రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని అనుపమ తండ్రి తెలంగాణ సీఎం సహాయనిధికి అందించారు.

More Telugu News