Naga Shauryaa: నాగశౌర్యతో సెట్స్ పైకి నందినీ రెడ్డి

  • 'ఓ బేబీ'తో హిట్ కొట్టిన నందినీ రెడ్డి 
  • ప్రేమ కథాంశంతో తదుపరి సినిమా 
  •  నిర్మాతగా ప్రియాంక దత్  
Nandini Reddy Movie

ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తయారు చేయడంలో దర్శకురాలు నందినీ రెడ్డి సిద్ధహస్తురాలు. ఈ మధ్య ఆమె తెరకెక్కించిన 'ఓ బేబీ' చిత్రం ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ కథతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన ఆమె, ఈ సారి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకుంది.

వైజయంతీ మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కథానాయకుడిగా నాగశౌర్యను తీసుకున్నారు. కథానాయిక ఎంపిక జరగవలసి వుంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, లక్ష్మీ భూపాల్ సంభాషణలను అందిస్తున్నాడు.

More Telugu News