వైజయంతీ మూవీస్ నుంచి అధికారిక ప్రకటన .. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ మూవీ ఖరారు
- 'మహానటి'తో నాగ్ అశ్విన్ కి మంచి పేరు
- చాలా కాలంగా కథపై జరిగిన కసరత్తు
- త్వరలోనే పూర్తి వివరాలు
'మహానటి' సినిమాతో వైజయంతీ మూవీస్ బ్యానర్ పేరును నాగ్ అశ్విన్ మరింత పెంచాడు. ఆ సినిమా తరువాత ఆయన చాలా ఎక్కువ సమయమే తీసుకుని ఒక కొత్త కథను తయారు చేసుకున్నాడు. ఆ సినిమాలో కథానాయకుడిగా ప్రభాస్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని చెప్పేసి ఆయనను సంప్రదించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ కి గల పేరు .. దర్శకుడిగా నాగ్ అశ్విన్ సామర్థ్యం .. కథలోని కొత్తదనం కారణంగా వెంటనే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అందువల్లనే ఈ రోజున ఈ ప్రకటన వచ్చింది. ఈ ప్రాజెక్టును గురించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.