మాకు శ్రీశైలం నీరు వదలరా?: ఏపీని ప్రశ్నించిన తెలంగాణ
- నీరంతా శ్రీశైలంలోనే ఉంచుకుంటే ఎలా?
- జనవరిలో 63 టీఎంసీలు వదలాలి
- 5 టీఎంసీలే వదిలారంటున్న తెలంగాణ
జనవరిలో దాదాపు 63 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి వదలాల్సి వుండగా, కేవలం 5 టీఎంసీలను మాత్రమే వదిలారని గుర్తుచేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. గతంలో జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీశైలం నుంచి సాగర్ కు నీటిని విడుదల చేసేలా ఏపీ సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.