ఇప్పుడు రూ.20కే దొరుకుతున్నాయ్.. ఒకప్పుడు బంగారం కంటే విలువైనవి!
- ఉప్పు, మిరియాలు ఒకప్పుడు బంగారం కంటే విలువైనవి
- ఉప్పును కొన్ని దేశాల్లో కరెన్సీలా ఉపయోగించేవారు
- ఆహారం పాడవకుండా ఉంచడంలో ఉప్పు కీలక పాత్ర
- మిరియాలను ‘బ్లాక్ గోల్డ్’గా పిలిచేవారు
- ఆహార నిల్వతో పాటు ఔషధ గుణాల వల్ల మిరియాలకు విలువ
- ఇప్పుడు ఇవి రూ.20లోపే అందుబాటులో ఉండడం విశేషం
ఈ రోజుల్లో రూ.20 ఉంటే ఉప్పు ప్యాకెట్ లేదా చిన్న మిరియాల ప్యాకెట్ను సులభంగా కొనేయొచ్చు. అయితే ఒకప్పుడు ఈ రెండు వస్తువులు బంగారం కంటే విలువైనవిగా భావించేవారు. రాజ్యాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయడమే కాకుండా, వాణిజ్య మార్గాల ఏర్పాటుకు, యుద్ధాలకు, కొత్త దేశాల అన్వేషణకు కూడా ఇవే కారణమయ్యాయి.
రిఫ్రిజిరేటర్లు లేని కాలంలో ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఉప్పు అత్యంత కీలకం. మాంసం, చేపలు, కూరగాయలను పాడవకుండా కాపాడటంలో ఇది ప్రధాన పాత్ర పోషించింది. దీంతో ఉప్పు ఉత్పత్తి జరిగే ప్రాంతాలు సంపన్నంగా మారగా, ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఉప్పు గడ్డలను కరెన్సీలా ఉపయోగించేవారు. ‘శాలరీ’ అనే పదం కూడా ఉప్పుతో సంబంధం ఉన్న లాటిన్ పదం ‘సలారియం’ నుంచి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.
మరోవైపు భారతదేశంలోని మలబార్ తీరంలో పండే నల్ల మిరియాలను ఒకప్పుడు ‘బ్లాక్ గోల్డ్’గా పిలిచేవారు. ఐరోపాకు వాటిని తరలించడం ఎంతో కష్టసాధ్యంగా ఉండటంతో వాటి ధర అమాంతం పెరిగేది. ధనికులు మిరియాలను తాళం వేసిన పెట్టెల్లో భద్రపరిచేవారు. కొన్ని ప్రాంతాల్లో పన్నులు, అద్దెలు కూడా మిరియాలతోనే చెల్లించేవారు. మిరియాలు కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే కాదు. మాంసం వంటి ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, వాటి దుర్వాసనను తగ్గించేందుకు కూడా మిరియాలను ఉపయోగించేవారు. ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మడంతో వైద్యంలోనూ వీటికి మంచి డిమాండ్ ఉండేది.
భారతదేశానికి నేరుగా సముద్ర మార్గాన్ని కనుగొనాలన్న యూరోపియన్ దేశాల ప్రయత్నాలకు కూడా ఈ మిరియాల వ్యాపారమే ప్రధాన కారణమైంది. వ్యవసాయం, రవాణా, ప్రపంచ వాణిజ్యం అభివృద్ధి చెందడంతో ఒకప్పుడు అమూల్యమైన ఉప్పు, మిరియాలు ఇప్పుడు ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ వంటింటి వస్తువులుగా మారిపోయాయి.
రిఫ్రిజిరేటర్లు లేని కాలంలో ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఉప్పు అత్యంత కీలకం. మాంసం, చేపలు, కూరగాయలను పాడవకుండా కాపాడటంలో ఇది ప్రధాన పాత్ర పోషించింది. దీంతో ఉప్పు ఉత్పత్తి జరిగే ప్రాంతాలు సంపన్నంగా మారగా, ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఉప్పు గడ్డలను కరెన్సీలా ఉపయోగించేవారు. ‘శాలరీ’ అనే పదం కూడా ఉప్పుతో సంబంధం ఉన్న లాటిన్ పదం ‘సలారియం’ నుంచి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.
మరోవైపు భారతదేశంలోని మలబార్ తీరంలో పండే నల్ల మిరియాలను ఒకప్పుడు ‘బ్లాక్ గోల్డ్’గా పిలిచేవారు. ఐరోపాకు వాటిని తరలించడం ఎంతో కష్టసాధ్యంగా ఉండటంతో వాటి ధర అమాంతం పెరిగేది. ధనికులు మిరియాలను తాళం వేసిన పెట్టెల్లో భద్రపరిచేవారు. కొన్ని ప్రాంతాల్లో పన్నులు, అద్దెలు కూడా మిరియాలతోనే చెల్లించేవారు. మిరియాలు కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే కాదు. మాంసం వంటి ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, వాటి దుర్వాసనను తగ్గించేందుకు కూడా మిరియాలను ఉపయోగించేవారు. ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మడంతో వైద్యంలోనూ వీటికి మంచి డిమాండ్ ఉండేది.
భారతదేశానికి నేరుగా సముద్ర మార్గాన్ని కనుగొనాలన్న యూరోపియన్ దేశాల ప్రయత్నాలకు కూడా ఈ మిరియాల వ్యాపారమే ప్రధాన కారణమైంది. వ్యవసాయం, రవాణా, ప్రపంచ వాణిజ్యం అభివృద్ధి చెందడంతో ఒకప్పుడు అమూల్యమైన ఉప్పు, మిరియాలు ఇప్పుడు ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ వంటింటి వస్తువులుగా మారిపోయాయి.