టీడీపీతో కొనసాగలేను.. ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: స్పీకర్ ను కోరిన వల్లభనేని వంశీ
- ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను బూతులు తిట్టించారు
- సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా నాకు చెప్పలేదు
- ఇకపై నన్ను టీడీపీ సభ్యుడిగా చూడవద్దు
టీడీపీలో కొనసాగే పరిస్థితి తనకు లేదని వంశీ చెప్పారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనను ఎన్నుకున్నారని... వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. ఇకపై తనను టీడీపీ సభ్యుడిగా చూడవద్దని... ప్రత్యేక సభ్యుడిగా తనను గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా తన హక్కులను కాపాడాలని విన్నవించారు.