కడపటి చూపుకు నోచుకోనివ్వండి: ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాల వేడుకోలు
- శుక్రవారం వరకూ గాంధీ హాస్పటల్ లోనే మృతదేహాలు
- ఓవైపు ఎన్.హెచ్.ఆర్.సి, మరోవైపు హైకోర్టు విచారణ
- విచారణ గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు
ఇదిలా ఉంటే, మృతుల కుటుంబ సభ్యులు తమ వారి మృత దేహాల కడపటి చూపుకు నోచుకోనివ్వండి అంటూ అధికారులను, ఇటు మీడియాను వేడుకుంటున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుండి తమ వారి డెడ్ బాడీలను చూడనివ్వడం లేదని, పోస్టుమార్టం పూర్తయిన బాడీలను ఇంకా అప్పగించక పోతే ఎలా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తండ్రి రాజయ్య సోమవారం మీడియాతో తమకు అండగా ఎవరూ రాని కారణంగానే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు.