సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సాయిపల్లవి ఫ్యూచర్ ప్లాన్స్ 
  • 'బుర్రకథ' ఒకరోజు ఆలస్యం 
  • పారితోషికం పెంచిన కథానాయిక
*  'నేను వైద్య వృత్తిని మాత్రం వదులుకునేది లేదు' అంటోంది కథానాయిక సాయిపల్లవి. ఎంబీబీఎస్ చదివి సినిమాల్లోకి వచ్చిన సాయిపల్లవి ఈ విషయంపై మాట్లాడుతూ, 'అవకాశాలు వచ్చినంత కాలం సినిమాల్లో నటిస్తాను. తర్వాత ఇక నా డాక్టర్ వృత్తిలో స్థిరపడతాను. డాక్టర్ కావాలని కలలుకని మరీ అయ్యాను. అందుకని భవిష్యత్తులో వైద్య వృత్తిలోనే స్థిరపడతాను' అని చెప్పింది.
*  ఆది సాయికుమార్ హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన 'బుర్రకథ' చిత్రం విడుదల ఒకరోజు వాయిదా పడింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయాల్సివుండగా, ఒకరోజు ఆలస్యంగా అంటే 29న విడుదల చేస్తున్నారు.
*  'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' హిట్టవడంతో ఆ చిత్రంలో కథానాయికగా నటించిన కైరా అద్వానీకి బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది. దీంతో అమ్మడు పారితోషికాన్ని అమాంతం పెంచేసి, డబుల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కైరాకు కోటి లోపులోనే పారితోషికాన్ని చెల్లించారు.
Go Back to Shorts
Sai Pallavi
Adi Saikumar
arjun Reddy
Kaira Advani

More Telugu News