'అర్జున్ సురవరం' విడుదల తేదీ ఖరారు

  • తమిళంలో హిట్ కొట్టిన 'కనితన్'
  • నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి
  • ఈ నెల 17వ తేదీన విడుదల
నిఖిల్ కథానాయకుడిగా .. టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో 'అర్జున్ సురవరం' నిర్మితమైంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ రోజున రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ 'అవెంజర్స్ ఎండ్ గేమ్' కారణంగా థియేటర్ల సమస్య తలెత్తుతుందని భావించారు.

అంతేకాకుండా ఒక వైపున 'జెర్సీ' .. మరో వైపున 'కాంచన 3' జోరుగా వసూళ్లు రాబడుతుండగా థియేటర్లకు రావడం అంత కరెక్ట్ కాదని భావించారు. అందువలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలో 'కనితన్' పేరుతో ఘనవిజయాన్ని సాధించిన ఈ సినిమా, తెలుగులో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.
Go Back to Shorts
nikhil
lavanya tripathi

More Telugu News