అంతమాత్రం అవగాహన లేదా?: జగన్ కు లోకేశ్ కౌంటర్
- ప్రైవేటురంగంలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి
- ఈ విషయమై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది
- జగన్ కొత్తగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటున్నారు
- విశాఖపట్నంలో విద్యార్థులతో ఏపీ మంత్రి ముఖాముఖి
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. అప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏ రంగంలో అయినా రాణించేలా యువత రాటుదేలాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పెద్దఎత్తున ఐటీ ఉద్యోగాలు వచ్చాయని లోకేశ్ తెలిపారు. 2019 ఎన్నికలు ఏపీకి చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కాలంలోనే చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో భారీగా అభివృద్ధి జరిగిందనీ, మరో ఐదేళ్లు అధికారం అప్పగిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని లోకేశ్ అన్నారు.