చివరి వన్డేలో టీమిండియా ఓటమి... సిరీస్ విజేత ఆసీస్
- ఐదో వన్డేలో 35 రన్స్ తో గెలిచిన కంగారూలు
- 3-2తో సిరీస్ కైవసం
- ఓటమితో సిరీస్ ముగించిన కోహ్లీ సేన
273 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 237 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ లోనూ రాణించి 46 పరుగులు చేశాడు. కేదార్ జాదవ్ 44 పరుగులు చేసినా ఆసీస్ బౌలర్లు పట్టుదలగా బౌలింగ్ చేయడంతో లక్ష్యఛేదన కష్టసాధ్యంగా మారింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, కమిన్స్, స్టొయినిస్, రిచర్డ్ సన్ రెండేసి వికెట్లతో కోహ్లీసేన పనిబట్టారు. అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు 9 వికెట్లకు 272 పరుగులు చేశారు.