‘వెన్నుపోటు’ పాటను చూసి చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు?: లక్ష్మీ పార్వతి

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో నిజాలు బయటకు వస్తాయని దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు అబద్ధాల సామ్రాజ్యాన్ని నిర్మించారని విమర్శించారు. ఈ సినిమాతో వైస్రాయ్ హోటల్ ఉదంతం అంతా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసలు ‘వెన్నుపోటు’ అనే ఒక పాటను చూసి చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మీ పార్వతి మాట్లాడారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Telugudesam
Chandrababu
ntr
lakshmi parvathi
criticise
lakshmis ntr
movie
song
vennupotu

More Telugu News