వీడియో: పోలీసును పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపిన ఉగ్రవాది
- వెలుగులోకి సీసీటీవీలో ఉగ్రదాడి దృశ్యాలు
- పోలీసు వద్దకు వచ్చి పాయింట్ బ్లాంక్లో కాల్పులు
- కాల్పుల తర్వాత ఉగ్రవాది పరార్
- ఘటనతో లాల్చౌక్ ప్రజల్లో భయాందోళన
- దాడి బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ
జమ్మూకశ్మీర్లో పోలీసు కానిస్టేబుల్పై ఉగ్రవాది అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. లాల్చౌక్ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియోలో ఉగ్రవాది పోలీసు వద్దకు నేరుగా వచ్చి పాయింట్-బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆశిఖ్ హుస్సేన్ను వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దాడికి పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.
దాడి అనంతరం భద్రతా బలగాలు ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి విస్తృత గాలింపు చేపట్టాయి. నిందితుణ్ని గుర్తించి పట్టుకునేందుకు అదనపు బలగాలను మోహరించగా, కీలక రహదారులపై తనిఖీలు కూడా చేపట్టారు.
ఈ ఘటనను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో ఇప్పటికే భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన పరిస్థితుల్లో ఈ దాడి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆశిఖ్ హుస్సేన్ను వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దాడికి పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.
దాడి అనంతరం భద్రతా బలగాలు ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి విస్తృత గాలింపు చేపట్టాయి. నిందితుణ్ని గుర్తించి పట్టుకునేందుకు అదనపు బలగాలను మోహరించగా, కీలక రహదారులపై తనిఖీలు కూడా చేపట్టారు.
ఈ ఘటనను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో ఇప్పటికే భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన పరిస్థితుల్లో ఈ దాడి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.