అన్ని ఊహాగానాలకూ తెరవేయబోతున్నా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

  • ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవు
  • ఇకపై కూడా ఉండబోవు
  • మీడియాతో లక్ష్మీ నారాయణ
తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న మొత్తం ప్రచారానికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని, ఇకపై కూడా అలాగే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను స్వతంత్రంగానే రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. ప్రజల సమస్యలకు ఓ పరిష్కార మార్గం వెతకడమే తన ముఖ్య కర్తవ్యమని తెలిపారు. పాలకులు సమర్థవంతంగా పాలన అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాగా, మరో మూడు రోజుల్లో లక్ష్మీ నారాయణ తాను పెట్టబోయే రాజకీయ పార్టీ గురించిన అన్ని వివరాలూ వెల్లడి కానున్నాయి.
Go Back to Shorts
CBI
JD
Lakshmi Narayana
Politics

More Telugu News