డైరెక్టర్ పరశురామ్ కు అల్లు అరవింద్ ఎంత ప్రాఫిట్ ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన 'గీత గోవిందం'
- ఖుషీ అవుతున్న నిర్మాత అల్లు అరవింద్
- పరశురామ్ కు రూ. 10 కోట్ల ప్రాఫిట్ ఇచ్చిన అరవింద్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'గీత గోవిందం' చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రాన్ని అద్భుతమైన లవ్ స్టోరీగా మలచిన ఘనత పరశురామ్ దే. సినిమా లాభాల పంట పండించడంతో నిర్మాత అల్లు అరవింద్ ఖుషీ అయిపోయారు. ఇంతటి సక్సెస్ కు కారణమైన పరశురామ్ కు రూ. 10 కోట్ల ప్రాఫిట్ ను ఆయన ఇచ్చినట్టు తెలుస్తోంది.