సరికొత్త ఆల్ టైమ్ రికార్డుకు పెట్రోలు ధర!
- 'పెట్రో' ఉత్పత్తుల ధరలను పెంచిన ఓఎంసీలు
- ముంబైలో రూ. 89.29కి చేరిన లీటరు పెట్రోలు ధర
- ఢిల్లీలో రూ. 81.91
దేశ చరిత్రలో పెట్రోలు ధర రూ. 89ని దాటి ముందుకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల వల్లే 'పెట్రో' ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని, డాలర్ తో మారకపు విలువలో బలహీన పడుతున్న రూపాయి కూడా ధరల పెరుగుదలకు తోడవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర 78 డాలర్ల వద్ద కొనసాగుతోంది.