Mahesh Babu: తన తండ్రి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన మహేష్ బాబు తనయ

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి కేటీఆర్, రాచకొండ పోలీసుల గ్రీన్ ఛాలెంజ్ ను హీరో మహేష్ బాబు పూర్తి చేసి, మరో ముగ్గురిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురిలో మహేష్ పిల్లలు సితార, గౌతమ్, దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారు. మహేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తి చేశారు.సితార ఓ మొక్క నాటి, నీళ్లు పోసింది. ఇందుకు సంబంధించిన వీడియో ‘యూట్యూబ్’ కు చేరింది.

కాగా, తన పేరు నామినేట్ చేసినందుకు మహేష్ బాబుకు ధన్యవాదాలు చెబుతున్నానని, ‘గ్రీన్ ఛాలెంజ్’ని పూర్తి చేశానని తన ట్వీట్ లో వంశీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరో ముగ్గురిని ఆయన నామినేట్ చేశారు. హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు వంశీ పైడిపల్లి ‘గ్రీన్ ఛాలెంజ్’ చేశారు.
Go Back to Shorts
Mahesh Babu
sitara ghatammaneni

More Telugu News