ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ కన్నుమూత
- 1951లో 18 ఏళ్ల వయసులోనే తొలి అవార్డు
- 'పేరంటాలు' సినిమాపై నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి
- 1995లో ఉత్తమ ఫిలిం క్రిటిక్ గా నంది అవార్డు
- 2013లో 'సినిమాగా సినిమా'కి ఉత్తమ సినిమా గ్రంథం అవార్డు
ఆయన రాసిన 'సినిమాగా సినిమా' కి గానూ 2013లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ సినిమా గ్రంథం అవార్డు వచ్చింది. 1985-87 కాలంలో ఏపీ, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికార పత్రిక 'తెలుగు వెలుగు' కు తొలి సంపాదకుడిగా పనిచేశారు. ఇవేగాక ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.