ఏపీలోనూ టీఆర్‌ఎస్ శాఖ పెట్టాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు: కేటీఆర్‌

  • కేసీఆర్ పాలనపై ఏపీ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు
  • దేశం అబ్బురపడేలా తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది
  • 42 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం
  • తాగునీరు అందించాలని మిషన్ భగీరథ పథకం చేపట్టాం
ఏపీలోనూ టీఆర్‌ఎస్ శాఖ పెట్టాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ... దేశం అబ్బురపడేలా తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని, తాము 42 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, ఇంటింటికి తాగునీరు అందించాలన్న ఉద్దేశంతోనే మిషన్ భగీరథ పథకం చేపట్టామని అన్నారు.

సీఎంగా కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలు చల్లగా ఉంటున్నాయని కేటీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వాలు మధిరకు నిధులు కేటాయించలేదని, తమ ప్రభుత్వం మాత్రం మధిర అభివృద్ధికి రూ. 15 కోట్లు కేటాయించిందని అన్నారు. తెలంగాణలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తోందని అన్నారు.         
KTR
Telangana
TRS

More Telugu News