టీమిండియా చేసిన తప్పు మేము చేయం!: హర్మన్ ప్రీత్ కౌర్
- వరుస వైఫల్యాలతో టీమిండియాపై విమర్శలు
- టీమిండియా చేసిన పొరపాట్లు పునరావృతం కానివ్వం
- సఫారీ గడ్డపై వీలైనంత త్వరగా అడుగుపెట్టాలి
- సఫారీలతో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాలి
కోహ్లీ సేన సౌతాఫ్రికా పర్యటనకు ముందు సొంతగడ్డపై ఎక్కువ మ్యాచ్ లు ఆడడం వల్ల, ఆటగాళ్లకు అవసరమైన విశ్రాంతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లిందని తెలిపింది. సౌతాఫ్రికాలో పరిస్థితులకు అలవాటు పడటం అంత సులువు కాదని చెప్పింది. ఈ ప్రాక్టీస్ క్యాంపు తమకెంతో సాయపడుతోందని పేర్కొంది. జట్టులోకి కొత్త అమ్మాయిలు కూడా వచ్చారని తెలిపింది. గతేడాది ప్రపంచకప్ కు ముందు తాము చాలా మ్యాచ్ లు ఆడామని, వరల్డ్ కప్ తరువాత ఇప్పటి వరకు ఆడలేదని గుర్తు చేసింది. అందుకే సఫారీలతో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాలనుకుంటున్నామని తెలిపింది. ప్రాక్టీస్ మ్యాచ్ ల తరువాతే తాము సిరీస్ కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లని హర్మన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది.