మహారాష్ట్ర మంత్రికి ఆర్బీఐ షాక్.. డీసీసీబీ నుంచి తొలగించాలని ఆదేశం
- మహారాష్ట్ర మంత్రి బాబాసాహెబ్ పాటిల్పై ఆర్బీఐ చర్యలు
- లాతూర్ సహకార బ్యాంకు డైరెక్టర్ల బోర్డు నుంచి తొలగింపు ఆదేశం
- పదేళ్ల పదవీకాల పరిమితి నిబంధన ఉల్లంఘనే కారణం
- మంత్రితో పాటు మరో ఏడుగురు డైరెక్టర్లకూ ఇదే ఆదేశం
- హైకోర్టు జోక్యంతో రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్
మహారాష్ట్ర సహకార శాఖ మంత్రి బాబాసాహెబ్ పాటిల్కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ షాక్ ఇచ్చింది. లాతూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్ల బోర్డు నుంచి ఆయనతో పాటు మరో ఏడుగురు డైరెక్టర్లను తక్షణమే తొలగించాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పదేళ్లకు మించి పదవిలో కొనసాగుతూ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కాగా, మంత్రి పాటిల్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేృతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్గానికి చెందిన నేత కావడం గమనార్హం.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949 ప్రకారం, జిల్లా సహకార బ్యాంకుల డైరెక్టర్లుగా ఒక వ్యక్తి గరిష్ఠంగా 10 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉండటానికి అర్హులు. అయితే, ఈ నిబంధనను అతిక్రమించి మంత్రి పాటిల్ సహా ఎనిమిది మంది డైరెక్టర్లు పదవుల్లో కొనసాగుతున్నారని బ్యాంకు సభ్యుడు సతీశ్ శేషారావు జాదవ్ ఈ ఏడాది మే నెలలో ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు.
సదరు ఫిర్యాదుపై ఆర్బీఐ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, జాదవ్ బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఆరు వారాల్లోగా ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలని ఆగస్టు 3న ఆర్బీఐని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్బీఐ, సంబంధిత డైరెక్టర్ల నుంచి వివరణ కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏడుగురు డైరెక్టర్లు సెప్టెంబర్ 10న తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. అయినప్పటికీ, నిబంధనల ప్రకారం అనర్హులైన డైరెక్టర్లను తొలగించాలంటూ సెప్టెంబర్ 18న లాతూర్ డీసీసీబీకి ఆర్బీఐ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949 ప్రకారం, జిల్లా సహకార బ్యాంకుల డైరెక్టర్లుగా ఒక వ్యక్తి గరిష్ఠంగా 10 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉండటానికి అర్హులు. అయితే, ఈ నిబంధనను అతిక్రమించి మంత్రి పాటిల్ సహా ఎనిమిది మంది డైరెక్టర్లు పదవుల్లో కొనసాగుతున్నారని బ్యాంకు సభ్యుడు సతీశ్ శేషారావు జాదవ్ ఈ ఏడాది మే నెలలో ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు.
సదరు ఫిర్యాదుపై ఆర్బీఐ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, జాదవ్ బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఆరు వారాల్లోగా ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలని ఆగస్టు 3న ఆర్బీఐని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్బీఐ, సంబంధిత డైరెక్టర్ల నుంచి వివరణ కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏడుగురు డైరెక్టర్లు సెప్టెంబర్ 10న తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. అయినప్పటికీ, నిబంధనల ప్రకారం అనర్హులైన డైరెక్టర్లను తొలగించాలంటూ సెప్టెంబర్ 18న లాతూర్ డీసీసీబీకి ఆర్బీఐ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.