టాటా సన్స్‌లో కీలక మలుపు.. ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పొడిగింపు!

టాటా సన్స్‌లో కీలక మలుపు.. ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పొడిగింపు!

Major turn in Tata Sons Chandrasekaran to continue as Chairman for five more years
  • చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్లు ఇవ్వాలని బోర్డు మద్దతు
  • టాటా సన్స్‌ లిస్టింగ్‌కు బోర్డు ఆమోదం
  • రెండు ప్రతిపాదనలను నోయెల్‌ టాటా వ్యతిరేకించినట్లు సమాచారం
  • ఆర్‌బీఐ ఆదేశాలతో వేగం పుంజుకున్న లిస్టింగ్‌ ప్రక్రియ
  • పదవి కొనసాగబోనని ఆగస్టులో ప్రకటించిన చంద్రశేఖరన్‌
  • బోర్డు నిర్ణయంతో టాటా సన్స్‌లో నాయకత్వంపై మలుపు
టాటా గ్రూప్‌ భవిష్యత్‌ నాయకత్వంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలం ఇవ్వడంతో పాటు కంపెనీని స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఈ రెండు ప్రతిపాదనలను టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా వ్యతిరేకించినట్లు ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌ కథనం పేర్కొంది.

నోయెల్‌ టాటా అభ్యంతరం
టాటా ట్రస్ట్స్‌ తరఫున బోర్డులో నోయెల్‌ టాటాకు వీటో హక్కు ఉంది. చంద్రశేఖరన్‌ కొనసాగింపుతో పాటు లిస్టింగ్‌ ప్రతిపాదనపై ఆయన అసమ్మతి వ్యక్తం చేసినట్లు సమాచారం. తన వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాలను అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఇతర బోర్డు సభ్యుల మద్దతుతో ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లు కథనం తెలిపింది.

ఆర్‌బీఐ ఆదేశాలతో లిస్టింగ్‌
టాటా సన్స్‌ లిస్టింగ్‌ అంశం కొంతకాలంగా పెండింగ్‌లో ఉంది. ఆర్‌బీఐ తాజాగా కంపెనీ లిస్టింగ్‌ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించింది. 2022లో టాటా సన్స్‌ను ‘అప్పర్‌ లేయర్‌’ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ గుర్తించింది. దీంతో మూడేళ్లలోగా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయాల్సిన నిబంధన ఏర్పడింది.

చంద్రశేఖరన్‌ పదవీకాలం
చంద్రశేఖరన్‌ 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022లో ఆయనకు రెండోసారి ఐదేళ్ల పదవీకాలం లభించింది. అది 2027 ఫిబ్రవరి 20తో ముగియాల్సి ఉంది. అయితే మరోసారి బాధ్యతలు చేపట్టబోనని ఆయన ఈ ఏడాది ఆగస్టులో బోర్డుకు తెలియజేశారు.

మళ్లీ నాయకత్వంపై మలుపు
టాటా గ్రూప్‌లో వ్యాపారాల పనితీరు, మూలధన కేటాయింపుపై నోయెల్‌ టాటా ఆందోళనలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఎయిరిండియా, టాటా డిజిటల్‌ అంశాలు చర్చకు వచ్చాయి. దీంతో చంద్రశేఖరన్‌ వారసుడి ఎంపికపై టాటా ట్రస్ట్స్‌ కసరత్తు ప్రారంభించింది. ఇప్పుడు బోర్డు నిర్ణయంతో ఆ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

ఏజీఎంలో తొలిసారి అంతరాయం
ఆగస్టులో జరిగిన టాటా సన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశం కూడా అనూహ్యంగా వాయిదా పడింది. తగినంత కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. టాటా సన్స్‌ చరిత్రలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి. సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌కు సంబంధించిన పరిమితులు ఈ పరిణామానికి కారణమయ్యాయని సమాచారం.
Advertisement
N Chandrasekaran
Tata Sons
Noel Tata
Tata Sons IPO
RBI NBFC Listing
Tata Group Leadership

More Telugu News