సెప్టెంబరు 17 చరిత్రకు మతం రంగు పులిమే ప్రయత్నం జరుగుతోంది: కవిత
- సెప్టెంబర్ 17 సందర్భంగా జెండా ఆవిష్కరించిన కవిత
- తెలంగాణ పోరాట స్ఫూర్తిని గుర్తుచేసిన తెలంగాణ రక్షణ సేన అధినేత్రి
- కాంగ్రెస్, బీజేపీలపై కవిత విమర్శలు
- విలీన చరిత్రను వక్రీకరిస్తున్నాయని ఆరోపణ
- మతాలకు అతీతంగా ప్రజలు పోరాడారని వెల్లడి
తెలంగాణ విలీన పోరాట యోధుల స్ఫూర్తితో రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక శక్తులను గద్దె దించుతామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ పౌరుషానికి, పోరాట పటిమకు, త్యాగాల చరిత్రకు నిదర్శనమన్నారు. అయితే ఈ చారిత్రక రోజును కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ విలీనానికి స్టేట్ కాంగ్రెస్ పోరాటమే కారణమని సీఎం చెబుతున్నారని, అది వాస్తవం కాదని కవిత అన్నారు. సంస్థానాల్లో పోరాటం చేయడం తమ విధానం కాదని అప్పట్లో మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. నిజాం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన 10 లక్షల ఎకరాల భూమిని భారత యూనియన్లో విలీనం తర్వాత కాంగ్రెస్ తిరిగి జమీందార్లకు అప్పగించిందని ఆరోపించారు.
బీజేపీ తీరుపైనా కవిత మండిపడ్డారు. ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా ఆనాటి చరిత్రకు మతం రంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ పోరాటం జరిగిన సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉనికిలోనే లేవని అన్నారు.
జాగీర్దార్లు, జమీందార్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా మతాలకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా పోరాటం చేశారని కవిత తెలిపారు. వట్టికోట ఆళ్వార్ స్వామి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి వంటి వారు సైకిళ్లపై తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు.
కాళోజీ, దాశరథి, షోయాబుల్లాఖాన్, మగ్దూం మొయినుద్దీన్ వంటి కవులు, రచయితలు తమ రచనలతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారని చెప్పారు. వారి స్ఫూర్తితో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి వారు పోరాటంలో ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
అదే స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన కూడా కులమతాలకు అతీతంగా ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని కవిత అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు అంతం పలికే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ పౌరుషానికి, పోరాట పటిమకు, త్యాగాల చరిత్రకు నిదర్శనమన్నారు. అయితే ఈ చారిత్రక రోజును కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ విలీనానికి స్టేట్ కాంగ్రెస్ పోరాటమే కారణమని సీఎం చెబుతున్నారని, అది వాస్తవం కాదని కవిత అన్నారు. సంస్థానాల్లో పోరాటం చేయడం తమ విధానం కాదని అప్పట్లో మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. నిజాం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన 10 లక్షల ఎకరాల భూమిని భారత యూనియన్లో విలీనం తర్వాత కాంగ్రెస్ తిరిగి జమీందార్లకు అప్పగించిందని ఆరోపించారు.
బీజేపీ తీరుపైనా కవిత మండిపడ్డారు. ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా ఆనాటి చరిత్రకు మతం రంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ పోరాటం జరిగిన సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉనికిలోనే లేవని అన్నారు.
జాగీర్దార్లు, జమీందార్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా మతాలకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా పోరాటం చేశారని కవిత తెలిపారు. వట్టికోట ఆళ్వార్ స్వామి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి వంటి వారు సైకిళ్లపై తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు.
కాళోజీ, దాశరథి, షోయాబుల్లాఖాన్, మగ్దూం మొయినుద్దీన్ వంటి కవులు, రచయితలు తమ రచనలతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారని చెప్పారు. వారి స్ఫూర్తితో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి వారు పోరాటంలో ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
అదే స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన కూడా కులమతాలకు అతీతంగా ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని కవిత అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు అంతం పలికే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.