ఉధంపుర్లో కొనసాగుతున్న ఉగ్రవేట.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
- మజల్తాలో అనుమానాస్పద కదలికలతో ఆపరేషన్
- ఇంకా నిర్ధారణ కాని హతుల వివరాలు
- ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్
- సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసుల గాలింపు
- పిర్ పంజాల్ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం
జమ్మూ కశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మజల్తా ప్రాంతంలో బుధవారం సాయంత్రం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో కాల్పులు మొదలయ్యాయి.
కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. అయితే వారి వివరాలు ఇంకా నిర్ధారించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.
మొదట జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. కాల్పులు మొదలైన వెంటనే అదనపు బలగాలను అక్కడికి తరలించారు. ప్రస్తుతం భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.
ఉధంపుర్లో ఆపరేషన్ నేపథ్యంలో పిర్ పంజాల్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవల రాజౌరిలో లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్న ఓవర్గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సెప్టెంబరు 15న ముగ్గురిని అరెస్టు చేశారు.
మిగిలిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు స్నిఫర్ డాగ్స్, డ్రోన్లు సహా నిఘా వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. ఉధంపుర్-రియాసీ పరిధిలోని కీలక మార్గాల్లో వాహన తనిఖీలు పెంచారు. కొండ ప్రాంతాల్లో గట్టి నిఘా కొనసాగుతోంది.
ఉధంపుర్, రియాసీ, రాంబన్, కథువా, పూంచ్, రాజౌరి జిల్లాల కొండ ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.
కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. అయితే వారి వివరాలు ఇంకా నిర్ధారించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.
మొదట జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. కాల్పులు మొదలైన వెంటనే అదనపు బలగాలను అక్కడికి తరలించారు. ప్రస్తుతం భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.
ఉధంపుర్లో ఆపరేషన్ నేపథ్యంలో పిర్ పంజాల్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవల రాజౌరిలో లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్న ఓవర్గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సెప్టెంబరు 15న ముగ్గురిని అరెస్టు చేశారు.
మిగిలిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు స్నిఫర్ డాగ్స్, డ్రోన్లు సహా నిఘా వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. ఉధంపుర్-రియాసీ పరిధిలోని కీలక మార్గాల్లో వాహన తనిఖీలు పెంచారు. కొండ ప్రాంతాల్లో గట్టి నిఘా కొనసాగుతోంది.
ఉధంపుర్, రియాసీ, రాంబన్, కథువా, పూంచ్, రాజౌరి జిల్లాల కొండ ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.