సెప్టెంబర్‌ 17 వేడుకలు: కేంద్ర ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి.. రాష్ట్ర కార్యక్రమానికి రేవంత్‌ రెడ్డి

సెప్టెంబర్‌ 17 వేడుకలు: కేంద్ర ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి.. రాష్ట్ర కార్యక్రమానికి రేవంత్‌ రెడ్డి

September 17 celebrations Vice President for Central events and Revanth Reddy for State program
  • సెప్టెంబర్‌ 17న కేంద్రం, రాష్ట్రం వేర్వేరు పేర్లతో వేడుకలు
  • కేంద్ర విమోచన వేడుకలకు అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌
  • సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరణ
  • రాష్ట్రంలో ‘ప్రజా పాలన దినోత్సవం’గా నిర్వహణ
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వేడుకలు
హైదరాబాద్‌ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, సీఏపీఎఫ్‌ బలగాల పరేడ్‌ను పరిశీలించనున్నారు. గత కొన్నేళ్లుగా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు నిర్వహిస్తోంది. 

తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌ తదితరులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 32 జిల్లాల కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీల్లోనూ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది. ఈ రోజును ఏ పేరుతో నిర్వహించాలన్న దానిపై తెలంగాణలో కొన్నేళ్లుగా రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022, 2023లో ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా నిర్వహించగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024 నుంచి ‘ప్రజా పాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ‘హైదరాబాద్‌ విమోచన దినోత్సవం’గా వేడుకలు నిర్వహిస్తోంది.
Advertisement
C P Radhakrishnan
Revanth Reddy
Hyderabad Liberation Day
Telangana Praja Palana Dinotsavam
September 17 celebrations
G Kishan Reddy

More Telugu News