గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసు: ప్రధాన నిందితుడు కల్యాణ్ అరెస్ట్
- గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు కల్యాణ్ బైన్స్లా అరెస్ట్
- అతడితో పాటు మరో నిందితుడిని రాజస్థాన్లో పట్టుకున్న పోలీసులు
- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు
- ఇది నిందితులకు గుణపాఠం కావాలన్న బాధితురాలు సియా
- నిందితుడి క్షమాపణను తోసిపుచ్చిన బాధితురాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు కల్యాణ్ బైన్స్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని దౌసాలో మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో నిందితుడు లవ్నీశ్ గుర్జర్ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
గత ఆదివారం గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో స్పోర్ట్స్ బైక్పై వెళుతున్న సియా అనే యువతిని ఓ తెల్లటి కారు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. హెల్మెట్ ధరించి ఉన్న సియా, బైక్తో సహా రోడ్డుపై జారిపడిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేరం రుజువైతే నిందితుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ ఘటనపై బాధితురాలు సియా స్పందిస్తూ, తనను ఢీకొట్టిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. భవిష్యత్తులో ఏ మహిళా బైకర్పై ఇటువంటి వేధింపులు జరగకుండా ఉండాలని, ఈ కేసు నిందితులకు ఒక గుణపాఠం కావాలని ఆమె పేర్కొంది. ఇది ముమ్మాటికి హత్యాయత్నమేనని ఆమె ఆరోపించింది. నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు విశ్రమించేది లేదని ఆమె తండ్రి రోషన్ చౌహాన్ స్పష్టం చేశాడు.
అంతకుముందు అజ్ఞాతంలో ఉంటూనే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నిందితుడు కల్యాణ్ బైన్స్లా, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. అయితే బాధితురాలు సియా అతని క్షమాపణను తోసిపుచ్చింది. ప్రమాదం జరిగిన తర్వాత తనకు గాయాలయ్యాయా, కనీసం బతికే ఉందా అనే స్పృహ కూడా లేకుండా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడని ఆమె నిలదీసింది.
గత ఆదివారం గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో స్పోర్ట్స్ బైక్పై వెళుతున్న సియా అనే యువతిని ఓ తెల్లటి కారు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. హెల్మెట్ ధరించి ఉన్న సియా, బైక్తో సహా రోడ్డుపై జారిపడిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేరం రుజువైతే నిందితుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ ఘటనపై బాధితురాలు సియా స్పందిస్తూ, తనను ఢీకొట్టిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. భవిష్యత్తులో ఏ మహిళా బైకర్పై ఇటువంటి వేధింపులు జరగకుండా ఉండాలని, ఈ కేసు నిందితులకు ఒక గుణపాఠం కావాలని ఆమె పేర్కొంది. ఇది ముమ్మాటికి హత్యాయత్నమేనని ఆమె ఆరోపించింది. నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు విశ్రమించేది లేదని ఆమె తండ్రి రోషన్ చౌహాన్ స్పష్టం చేశాడు.
అంతకుముందు అజ్ఞాతంలో ఉంటూనే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నిందితుడు కల్యాణ్ బైన్స్లా, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. అయితే బాధితురాలు సియా అతని క్షమాపణను తోసిపుచ్చింది. ప్రమాదం జరిగిన తర్వాత తనకు గాయాలయ్యాయా, కనీసం బతికే ఉందా అనే స్పృహ కూడా లేకుండా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడని ఆమె నిలదీసింది.