కర్ణాటకలో విషాద ఘటన.. ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి

కర్ణాటకలో విషాద ఘటన.. ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి

Karnataka tragedy Four women die after fridge explodes in Belagavi
  • కర్ణాటకలోని బెళగావిలో ఘోర ప్రమాదం
  • రిఫ్రిజిరేటర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
  • మరో ఇద్దరికి 60 శాతం కాలిన గాయాలు, పరిస్థితి విషమం
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెళగావి జిల్లాలోని ఒక ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బెళగావి నగరంలోని సెంట్రల్ బస్ స్టాండ్ సమీపంలో గల చవత్ గల్లీలో రాజారాం కుటుంబం నివసిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లోని రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను శారద (50), ఆమె కుమార్తెలు ప్రియ, గంగతో పాటు భారతి అనే మహిళగా గుర్తించారు. వీరంతా మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో రాజారాంతో పాటు రోహన్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంలో గాయపడిన వారి శరీరాలు 60 శాతానికి పైగా కాలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ విషాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, ఆ ఫ్రిజ్ కొత్తదని తెలుస్తోంది. 
Advertisement
Belagavi
Refrigerator explosion
Karnataka news
Belagavi fire accident
Four women killed
Fridge blast tragedy

More Telugu News