‘బ్రిక్స్’తో భారత్కు ఏం లాభం? చిదంబరం ప్రశ్న.. బీజేపీ ఘాటు కౌంటర్
- గత సదస్సుల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు లేవన్న కాంగ్రెస్ నేత
- చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు
- దౌత్యంపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించిన నళిన్ కోహ్లీ
- ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13న బ్రిక్స్ సదస్సు
- 2026 జనవరి నుంచి భారత్ వద్ద బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు
భారత్కు బ్రిక్స్, ఎస్సీఓ, జీ20, క్వాడ్ వంటి అంతర్జాతీయ కూటముల నుంచి ఏం ప్రయోజనం కలుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల్లో భారత్కు చెప్పుకోదగ్గ ప్రయోజనాలు కనిపించలేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
‘‘గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల వల్ల భారత్కు స్పష్టమైన ప్రయోజనాలు కనిపించలేదు. గతంలో జరిగిన సదస్సులతో మాత్రం కొన్ని ప్రయోజనాలు వచ్చాయి’’ అని చిదంబరం అన్నారు. బ్రిక్స్తో పాటు ఎస్సీఓ, జీ20, క్వాడ్లోనూ భారత్ సభ్య దేశంగా ఉందని గుర్తుచేశారు. అయితే వీటి నుంచి దేశానికి ఏం దక్కుతోందో తనకు కనిపించడం లేదన్నారు.
చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్కు దౌత్య విధానంపై అవగాహన ఉందా? అంటూ బీజేపీ నేత నళిన్ కోహ్లీ ప్రశ్నించారు. దౌత్య సంబంధాలను కేవలం ‘ఇచ్చిపుచ్చుకోవడం’ కోణంలోనే కాంగ్రెస్ చూస్తోందా? అని నిలదీశారు. కీలకమైన అంతర్జాతీయ కార్యక్రమంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. 2026 జనవరి 1 నుంచి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టింది. ‘బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నొవేషన్, కోఆపరేషన్, సస్టైనబిలిటీ’ అనే థీమ్తో భారత్ ఈ బాధ్యతలు నిర్వహిస్తోంది.
బ్రిక్స్లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ ఉన్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా పలువురు దేశాధినేతలు సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 49 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతాన్ని బ్రిక్స్ దేశాలు కలిగి ఉన్నాయి.
‘‘గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల వల్ల భారత్కు స్పష్టమైన ప్రయోజనాలు కనిపించలేదు. గతంలో జరిగిన సదస్సులతో మాత్రం కొన్ని ప్రయోజనాలు వచ్చాయి’’ అని చిదంబరం అన్నారు. బ్రిక్స్తో పాటు ఎస్సీఓ, జీ20, క్వాడ్లోనూ భారత్ సభ్య దేశంగా ఉందని గుర్తుచేశారు. అయితే వీటి నుంచి దేశానికి ఏం దక్కుతోందో తనకు కనిపించడం లేదన్నారు.
చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్కు దౌత్య విధానంపై అవగాహన ఉందా? అంటూ బీజేపీ నేత నళిన్ కోహ్లీ ప్రశ్నించారు. దౌత్య సంబంధాలను కేవలం ‘ఇచ్చిపుచ్చుకోవడం’ కోణంలోనే కాంగ్రెస్ చూస్తోందా? అని నిలదీశారు. కీలకమైన అంతర్జాతీయ కార్యక్రమంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. 2026 జనవరి 1 నుంచి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టింది. ‘బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నొవేషన్, కోఆపరేషన్, సస్టైనబిలిటీ’ అనే థీమ్తో భారత్ ఈ బాధ్యతలు నిర్వహిస్తోంది.
బ్రిక్స్లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ ఉన్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా పలువురు దేశాధినేతలు సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 49 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతాన్ని బ్రిక్స్ దేశాలు కలిగి ఉన్నాయి.