తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్‌సీపై ప్రభుత్వం కీలక అడుగు

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్‌సీపై ప్రభుత్వం కీలక అడుగు

Telangana Government takes key step on PRC for state employees
  • పీఆర్‌సీ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక అడుగు
  • నివేదిక త్వరగా ఇవ్వాలని పీఆర్‌సీ ఛైర్మన్‌కు సీఎస్‌ లేఖ
  • రెండో పీఆర్‌సీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో నిర్ణయం
  • బకాయి డీఏల విడుదలపై ఉద్యోగుల నుంచి డిమాండ్లు
  • ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల ఒత్తిడి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. 2వ వేతన సవరణ కమిషన్‌ (పీఆర్‌సీ) నివేదికను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. ఈ మేరకు రెండో పీఆర్సీ ఛైర్మన్‌ ఎన్‌. శివశంకర్‌కు లేఖ రాశారు.

గతంలో నియమించిన రెండో వేతన సవరణ కమిషన్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పీఆర్‌సీ అమలుపై ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బకాయి ఉన్న డీఏలు విడుదల చేయాలని, పీఆర్‌సీ నివేదిక ఆధారంగా ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ అంశాలపై ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పీఆర్‌సీ కమిషన్‌ వేగంగా నివేదిక సమర్పిస్తే.. దాని ఆధారంగా ఉద్యోగుల వేతన సవరణపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

కమిషన్‌ నివేదిక అందిన తర్వాత ఫిట్‌మెంట్‌, వేతన సవరణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పీఆర్‌సీ ప్రక్రియపై ఉద్యోగుల్లో మరోసారి ఆశలు నెలకొన్నాయి.
Advertisement
Telangana Government
Telangana PRC
2nd Pay Revision Commission
Telangana Government Employees Salary Hike
N Sivashankar PRC Chairman
Telangana DA Arrears

More Telugu News