ఆలస్యమైన జొమాటో ఆర్డర్.. ట్రాక్ చేసి చూస్తే షాకింగ్ సీన్!
- జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్కు వింత అనుభవం
- ఆర్డర్ ఆలస్యం కావడంతో ట్రాకర్ ఆధారంగా లొకేషన్కు వెళ్లిన వ్యక్తి
- తన ఫుడ్ను డెలివరీ బాయ్ మరొకరితో కలిసి తింటున్నట్లు ఆరోపణ
- ఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్.. స్పందించిన జొమాటో
- రాత్రిపూట డెలివరీల భద్రతపై మళ్లీ మొదలైన చర్చ
ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ ఆలస్యం కావడం సహజమే. అయితే, ఓ కస్టమర్కు ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాను ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ భాగస్వామే తినేస్తున్నాడని ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన రిషబ్ కౌశిక్ ఆదివారం రాత్రి 10:58 గంటలకు జొమాటో యాప్ ద్వారా 'ఖడక్ సింగ్ కా ధాబా' నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేశారు. అయితే, యాప్ ట్రాకర్లో డెలివరీ బాయ్ లొకేషన్ దాదాపు 40 నిమిషాల పాటు ఒకే చోట నిలిచిపోయింది. దీంతో అనుమానం వచ్చిన రిషబ్, ట్రాకర్లో చూపిస్తున్న ఆ ప్రదేశానికి స్వయంగా వెళ్లారు.
అక్కడ తన ఆర్డర్ను డెలివరీ బాయ్ మరో వ్యక్తితో కలిసి తింటుండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలను, స్కూటర్ పక్కన పడేసి ఉన్న ఫుడ్ కంటైనర్లు, మిగిలిపోయిన ఆహారం ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన ఆర్డర్ను రూ. 100కు విక్రయించినట్లు కస్టమర్ సపోర్ట్ టీమ్ తనకు సమాధానమిచ్చిందని రిషబ్ ఆరోపించారు. ఇది 'డెలివరీ సర్వీస్'లా కాకుండా, 'ఫుడ్-షేరింగ్ ఎకానమీ'లా ఉందంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ పోస్ట్పై జొమాటో కేర్ స్పందిస్తూ, ఘటనపై విచారణ జరిపేందుకు ఆర్డర్ ఐడీని పంపాలని కోరింది. ఈ ఉదంతం ఆన్లైన్లో వైరల్ కావడంతో, పలువురు నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆర్డర్ చేసేటప్పుడు 'క్యాష్-ఆన్-డెలివరీ' ఎంచుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ సంఘటన ఫుడ్ డెలివరీ సేవల విశ్వసనీయతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన రిషబ్ కౌశిక్ ఆదివారం రాత్రి 10:58 గంటలకు జొమాటో యాప్ ద్వారా 'ఖడక్ సింగ్ కా ధాబా' నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేశారు. అయితే, యాప్ ట్రాకర్లో డెలివరీ బాయ్ లొకేషన్ దాదాపు 40 నిమిషాల పాటు ఒకే చోట నిలిచిపోయింది. దీంతో అనుమానం వచ్చిన రిషబ్, ట్రాకర్లో చూపిస్తున్న ఆ ప్రదేశానికి స్వయంగా వెళ్లారు.
అక్కడ తన ఆర్డర్ను డెలివరీ బాయ్ మరో వ్యక్తితో కలిసి తింటుండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలను, స్కూటర్ పక్కన పడేసి ఉన్న ఫుడ్ కంటైనర్లు, మిగిలిపోయిన ఆహారం ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన ఆర్డర్ను రూ. 100కు విక్రయించినట్లు కస్టమర్ సపోర్ట్ టీమ్ తనకు సమాధానమిచ్చిందని రిషబ్ ఆరోపించారు. ఇది 'డెలివరీ సర్వీస్'లా కాకుండా, 'ఫుడ్-షేరింగ్ ఎకానమీ'లా ఉందంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ పోస్ట్పై జొమాటో కేర్ స్పందిస్తూ, ఘటనపై విచారణ జరిపేందుకు ఆర్డర్ ఐడీని పంపాలని కోరింది. ఈ ఉదంతం ఆన్లైన్లో వైరల్ కావడంతో, పలువురు నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆర్డర్ చేసేటప్పుడు 'క్యాష్-ఆన్-డెలివరీ' ఎంచుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ సంఘటన ఫుడ్ డెలివరీ సేవల విశ్వసనీయతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.