ఏఐ ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి చేరిన ప్రపంచ కుబేరుల సంపద!
- ప్రపంచ కుబేరుల సంపద 15.1 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరిక
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడులతో భారీగా పెరిగిన ఆస్తులు
- ప్రపంచవ్యాప్తంగా 3,795కి ఎగబాకిన బిలియనీర్ల సంఖ్య
- కుబేరుల సంఖ్యలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఉత్తర అమెరికా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తడంతో ప్రపంచ కుబేరుల సంపద సరికొత్త రికార్డు సృష్టించింది. 2025 నాటికి బిలియనీర్ల మొత్తం ఆస్తి 15.1 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ 'అల్ట్రాటా' తన 'బిలియనీర్ సెన్సస్ 2026' నివేదికలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే బిలియనీర్ల సంఖ్య 8.2 శాతం పెరిగి 3,795కి చేరగా, వారి సంపద 12.8 శాతం మేర వృద్ధి చెందింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం.
ముఖ్యంగా ఏఐ రంగంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టిన కంపెనీల మార్కెట్ విలువ భారీగా పెరగడమే ఈ సంపద వృద్ధికి ప్రధాన కారణమని 'అల్ట్రాటా' నివేదిక స్పష్టం చేసింది. సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి టెక్నాలజీ కంపెనీల వ్యవస్థాపకులు, ప్రధాన వాటాదారులు అత్యధికంగా లాభపడ్డారు.
ఈ నివేదిక ప్రకారం, సంపద కేంద్రీకరణ కూడా తీవ్రస్థాయిలో ఉంది. 50 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి ఉన్న 29 మంది 'సూపర్ బిలియనీర్ల' చేతిలోనే 4.1 ట్రిలియన్ డాలర్ల సంపద కేంద్రీకృతమై ఉంది. ఇది మొత్తం బిలియనీర్ల ఆస్తిలో దాదాపు 27 శాతానికి సమానం. ప్రాంతాల వారీగా చూస్తే, 1,337 మంది బిలియనీర్లతో ఉత్తర అమెరికా అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత యూరప్ (1,081), ఆసియా (881) ఉన్నాయి.
అయితే, ఈ సంపదలో అధిక భాగం స్టాక్ మార్కెట్ విలువలతో ముడిపడి ఉన్నందున, 'ఏఐ'పై సెంటిమెంట్ మారితే ఇందులో హెచ్చుతగ్గులు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే దశాబ్దంలో సుమారు 6.6 ట్రిలియన్ డాలర్ల సంపద దాదాపు 5,000 మంది వారసులకు బదిలీ అవుతుందని కూడా అల్ట్రాటా అంచనా వేసింది.
ముఖ్యంగా ఏఐ రంగంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టిన కంపెనీల మార్కెట్ విలువ భారీగా పెరగడమే ఈ సంపద వృద్ధికి ప్రధాన కారణమని 'అల్ట్రాటా' నివేదిక స్పష్టం చేసింది. సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి టెక్నాలజీ కంపెనీల వ్యవస్థాపకులు, ప్రధాన వాటాదారులు అత్యధికంగా లాభపడ్డారు.
ఈ నివేదిక ప్రకారం, సంపద కేంద్రీకరణ కూడా తీవ్రస్థాయిలో ఉంది. 50 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి ఉన్న 29 మంది 'సూపర్ బిలియనీర్ల' చేతిలోనే 4.1 ట్రిలియన్ డాలర్ల సంపద కేంద్రీకృతమై ఉంది. ఇది మొత్తం బిలియనీర్ల ఆస్తిలో దాదాపు 27 శాతానికి సమానం. ప్రాంతాల వారీగా చూస్తే, 1,337 మంది బిలియనీర్లతో ఉత్తర అమెరికా అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత యూరప్ (1,081), ఆసియా (881) ఉన్నాయి.
అయితే, ఈ సంపదలో అధిక భాగం స్టాక్ మార్కెట్ విలువలతో ముడిపడి ఉన్నందున, 'ఏఐ'పై సెంటిమెంట్ మారితే ఇందులో హెచ్చుతగ్గులు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే దశాబ్దంలో సుమారు 6.6 ట్రిలియన్ డాలర్ల సంపద దాదాపు 5,000 మంది వారసులకు బదిలీ అవుతుందని కూడా అల్ట్రాటా అంచనా వేసింది.