నటుడు దునియా విజయ్కు విడాకులు.. భార్యకు రూ.2 కోట్ల భరణం చెల్లించాలని ఆదేశం
- కన్నడ నటుడు దునియా విజయ్కు భార్య నాగరత్న నుంచి విడాకులు
- భార్యకు రూ.2 కోట్లు భరణంగా చెల్లించాలని హైకోర్టు ఆదేశం
- ఏళ్ల తరబడి సాగుతున్న వీరి వివాదానికి తెరదించిన న్యాయస్థానం
- రెండు నెలల్లోగా భరణం చెల్లించకపోతే 6శాతం వడ్డీ వర్తింపు
- 'వీరసింహారెడ్డి'లో బాలకృష్ణకు విలన్గా నటించిన విజయ్
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత దునియా విజయ్ వైవాహిక జీవితానికి తెరపడింది. ఆయన భార్య నాగరత్నతో విడాకులను మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారి వైవాహిక వివాదానికి ముగింపు పలుకుతూ, నాగరత్నకు ఏకమొత్తం భరణంగా రూ.2 కోట్లు చెల్లించాలని విజయ్ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా చెల్లించాలని, గడువులోగా చెల్లించని పక్షంలో ఏటా 6 శాతం వడ్డీ వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
జస్టిస్ డి.కె. సింగ్, జస్టిస్ హెచ్. శాంతి భూషణ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నాగరత్న ప్రస్తుత పరిస్థితులు, ఈ దంపతులకు ఉన్న ముగ్గురు పిల్లల భవిష్యత్తు, చిత్ర పరిశ్రమలో విజయ్ ఆర్థిక స్థితిగతులు, హోదాను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గతంలో విడాకుల కోసం విజయ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, ఆయన చూపిన క్రూరత్వ కారణాలను న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఆయన విడాకుల పిటిషన్ను కొట్టివేసింది.
అయితే, వారి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడం, తిరిగి కలిసి జీవించేందుకు విజయ్ సుముఖంగా లేకపోవడంతో హైకోర్టు ఈ కేసును విచారించి విడాకులను మంజూరు చేసింది. తన తల్లిదండ్రులను నాగరత్న సరిగ్గా చూసుకోలేదని విజయ్ తన పిటిషన్లో ఆరోపించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం ఒక కీలక వ్యాఖ్య చేసింది. తెరపై మంచి నడవడిక, విలువలను ప్రదర్శించే ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల్లోనూ వాటిని ప్రతిబింబించాలని సూచించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకు ఇరు పక్షాలకు అవకాశం ఉందని తెలిపింది.
కాగా, నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రంలో దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. 2007లో వచ్చిన 'దునియా' చిత్రంతో ఆయన కన్నడలో స్టార్డమ్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో, ఆయన కుమార్తె మోనిషా విజయ్ కుమార్ కథానాయికగా 'సిటీ లైట్స్' అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది.
జస్టిస్ డి.కె. సింగ్, జస్టిస్ హెచ్. శాంతి భూషణ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నాగరత్న ప్రస్తుత పరిస్థితులు, ఈ దంపతులకు ఉన్న ముగ్గురు పిల్లల భవిష్యత్తు, చిత్ర పరిశ్రమలో విజయ్ ఆర్థిక స్థితిగతులు, హోదాను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గతంలో విడాకుల కోసం విజయ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, ఆయన చూపిన క్రూరత్వ కారణాలను న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఆయన విడాకుల పిటిషన్ను కొట్టివేసింది.
అయితే, వారి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడం, తిరిగి కలిసి జీవించేందుకు విజయ్ సుముఖంగా లేకపోవడంతో హైకోర్టు ఈ కేసును విచారించి విడాకులను మంజూరు చేసింది. తన తల్లిదండ్రులను నాగరత్న సరిగ్గా చూసుకోలేదని విజయ్ తన పిటిషన్లో ఆరోపించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం ఒక కీలక వ్యాఖ్య చేసింది. తెరపై మంచి నడవడిక, విలువలను ప్రదర్శించే ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల్లోనూ వాటిని ప్రతిబింబించాలని సూచించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకు ఇరు పక్షాలకు అవకాశం ఉందని తెలిపింది.
కాగా, నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రంలో దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. 2007లో వచ్చిన 'దునియా' చిత్రంతో ఆయన కన్నడలో స్టార్డమ్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో, ఆయన కుమార్తె మోనిషా విజయ్ కుమార్ కథానాయికగా 'సిటీ లైట్స్' అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది.