నిర్మలా సీతారామన్ జీ20 పర్యటన: ఇరాన్, చైనా అంశాలపై దృష్టి
- అమెరికాలో జరుగుతున్న జీ20 సమావేశాల్లో పాల్గొంటున్న నిర్మలా సీతారామన్
- ఇరాన్ సంక్షోభం, ఇంధన భద్రతపై భారత్ ప్రధానంగా దృష్టి
- అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, చైనా దిగుమతులపై ఆందోళన
- భారత్ను ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ప్రమోట్ చేసే ప్రయత్నం
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, ఆష్విల్లో నిర్వహిస్తున్న జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత్ పలు కీలక అంశాలను లేవనెత్తనుంది. ముఖ్యంగా ఇరాన్పై అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఇంధన భద్రత వంటి అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఈ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం నిర్మలా సీతారామన్ నిన్న సౌత్ కరోలినాలోని గ్రీన్విల్-స్పార్టన్బర్గ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆమెకు సాదర స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సుకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆతిథ్యమిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ, ఆర్థిక అసమతుల్యతలను తగ్గించడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు.
అయితే, ఇరాన్ సంక్షోభం కారణంగా ఇంధన భద్రతకు వాటిల్లే ముప్పుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముడి చమురు, సహజవాయువు ధరలు పెరిగితే, అది భారత దిగుమతి వ్యయాన్ని పెంచడమే కాకుండా.. ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని భారత్ భావిస్తోంది.
మరోవైపు, చౌకగా లభించే చైనా ఉత్పత్తుల వల్ల దేశీయ పరిశ్రమలకు కలుగుతున్న నష్టాన్ని ఎత్తిచూపుతూనే, ఏకపక్ష సుంకాల విధింపును భారత్ వ్యతిరేకించనుంది.
అంతర్జాతీయ సంస్థలకు భారత్ను ఒక ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ ఉత్పాదక, పెట్టుబడుల కేంద్రంగా ప్రమోట్ చేసేందుకు నిర్మలా సీతారామన్ ఈ వేదికను వినియోగించుకోనున్నారు. డిసెంబర్లో మయామిలో జరగనున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ఈ భేటీ ఒక సన్నాహక వేదికగా నిలవనుంది.
ఈ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం నిర్మలా సీతారామన్ నిన్న సౌత్ కరోలినాలోని గ్రీన్విల్-స్పార్టన్బర్గ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆమెకు సాదర స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సుకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆతిథ్యమిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ, ఆర్థిక అసమతుల్యతలను తగ్గించడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు.
అయితే, ఇరాన్ సంక్షోభం కారణంగా ఇంధన భద్రతకు వాటిల్లే ముప్పుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముడి చమురు, సహజవాయువు ధరలు పెరిగితే, అది భారత దిగుమతి వ్యయాన్ని పెంచడమే కాకుండా.. ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని భారత్ భావిస్తోంది.
మరోవైపు, చౌకగా లభించే చైనా ఉత్పత్తుల వల్ల దేశీయ పరిశ్రమలకు కలుగుతున్న నష్టాన్ని ఎత్తిచూపుతూనే, ఏకపక్ష సుంకాల విధింపును భారత్ వ్యతిరేకించనుంది.
అంతర్జాతీయ సంస్థలకు భారత్ను ఒక ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ ఉత్పాదక, పెట్టుబడుల కేంద్రంగా ప్రమోట్ చేసేందుకు నిర్మలా సీతారామన్ ఈ వేదికను వినియోగించుకోనున్నారు. డిసెంబర్లో మయామిలో జరగనున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ఈ భేటీ ఒక సన్నాహక వేదికగా నిలవనుంది.