అగ్రరాజ్యంలో మరో విషాదం.. హైదరాబాద్ యువకుడిని బలిగొన్న ఉద్యోగ వేట
- ఉద్యోగ వేటలో ఒత్తిడితో అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి
- మాస్టర్స్ పూర్తి చేసినా జాబ్ దొరక్క డిప్రెషన్కు గురైన సాయి ప్రదీప్
- మృతదేహం తరలింపునకు ఫండ్రైజర్ ప్రారంభించిన కుటుంబ సభ్యులు
- పెరుగుతున్న మరణాలపై ప్రవాస తెలుగు సంఘాల ఆందోళన
అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన మరో తెలుగు యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న హైదరాబాద్కు చెందిన ముస్తి సాయి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు సాయి ప్రణీత్ తెలిపారు. ఉద్యోగ అన్వేషణలో ఎదురైన తీవ్ర ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే అతని ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ అంటోనియోలో నివసిస్తున్న సాయి ప్రదీప్ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్స్ పట్టా పొందాడు. సప్లై చైన్ అనలిస్ట్గా ఆయనకు ఐదేళ్ల అనుభవం కూడా ఉంది. అయినప్పటికీ, చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అమెరికా జాబ్ మార్కెట్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి, డిప్రెషన్కు గురైనట్లు సమాచారం.
ఈ విషాద వార్త తెలియడంతో తెలంగాణలోని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయి ప్రదీప్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబం ఒక ఫండ్రైజర్ ప్రారంభించింది.
ఇటీవల కాలంలో అమెరికాలో ఉద్యోగ, వీసా సమస్యల కారణంగా తెలుగు విద్యార్థులు, యువకులు మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యంలో నెలకొన్న పరిస్థితులు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రవాస తెలుగు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ అంటోనియోలో నివసిస్తున్న సాయి ప్రదీప్ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్స్ పట్టా పొందాడు. సప్లై చైన్ అనలిస్ట్గా ఆయనకు ఐదేళ్ల అనుభవం కూడా ఉంది. అయినప్పటికీ, చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అమెరికా జాబ్ మార్కెట్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి, డిప్రెషన్కు గురైనట్లు సమాచారం.
ఈ విషాద వార్త తెలియడంతో తెలంగాణలోని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయి ప్రదీప్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబం ఒక ఫండ్రైజర్ ప్రారంభించింది.
ఇటీవల కాలంలో అమెరికాలో ఉద్యోగ, వీసా సమస్యల కారణంగా తెలుగు విద్యార్థులు, యువకులు మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యంలో నెలకొన్న పరిస్థితులు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రవాస తెలుగు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.