టారిఫ్లతోనే అమెరికా ధనిక దేశంగా మారింది: డొనాల్డ్ ట్రంప్
- సుంకాలే తనకెంతో ఇష్టమైన పదమని చెప్పిన అమెరికా అధ్యక్షుడు
- విదేశీ కంపెనీలు అమెరికాలోనే కార్ల ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాయని వెల్లడి
- టారిఫ్ల వల్లే దేశంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరణ
- డెమొక్రాట్లు గెలిస్తే పన్నులు పెరిగి, ఉద్యోగాలు పోతాయని హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ల (సుంకాలు) విధానాన్ని బలంగా సమర్థించుకున్నారు. దిగుమతులపై విధించిన సుంకాల వల్లే అమెరికా అత్యంత ధనిక దేశంగా మారిందని, విదేశీ కంపెనీలు తమ తయారీ యూనిట్లను అమెరికాకు తరలించాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు.
సౌత్ కరోలినాలోని మిర్టిల్ బీచ్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. "నాకు అత్యంత ఇష్టమైన పదం టారిఫ్. ఆ పదాన్ని నేను ప్రేమిస్తున్నాను. అది మనల్ని విపరీతంగా ధనవంతుల్ని చేసింది" అని వ్యాఖ్యానించారు. సుంకాల విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా, అమెరికన్లకు ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయని ఆయన తెలిపారు.
విదేశీ కార్ల తయారీ కంపెనీలకు తాను ఒకటే చెబుతున్నానని ట్రంప్ అన్నారు. "అమెరికాకు కార్లను ఎగుమతి చేయాలంటే 25 శాతం సుంకం కట్టాలి. అది సాధ్యం కాదంటే, ఇక్కడికే వచ్చి మీ కార్ల ఫ్యాక్టరీలను నిర్మించుకోవాలి. ఇప్పుడు సౌత్ కరోలినాలో అదే జరుగుతోంది" అని ఆయన వివరించారు. ఈ విధానం వల్ల దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ విధానాల వల్ల అమెరికాలోకి సుమారు 19.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని ట్రంప్ తెలిపారు. దేశవ్యాప్తంగా వందల, వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు నిర్మిస్తుండటంతో నిర్మాణ రంగంలో ఉద్యోగాలు భారీగా పెరిగాయని అన్నారు. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలిస్తే తాను తెచ్చిన పన్ను, వాణిజ్య విధానాలు తలకిందులవుతాయని, పన్నులు పెరిగి, ఉద్యోగాలు పోతాయని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్లో రిపబ్లికన్ల నియంత్రణ కొనసాగేందుకు తమ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
సౌత్ కరోలినాలోని మిర్టిల్ బీచ్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. "నాకు అత్యంత ఇష్టమైన పదం టారిఫ్. ఆ పదాన్ని నేను ప్రేమిస్తున్నాను. అది మనల్ని విపరీతంగా ధనవంతుల్ని చేసింది" అని వ్యాఖ్యానించారు. సుంకాల విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా, అమెరికన్లకు ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయని ఆయన తెలిపారు.
విదేశీ కార్ల తయారీ కంపెనీలకు తాను ఒకటే చెబుతున్నానని ట్రంప్ అన్నారు. "అమెరికాకు కార్లను ఎగుమతి చేయాలంటే 25 శాతం సుంకం కట్టాలి. అది సాధ్యం కాదంటే, ఇక్కడికే వచ్చి మీ కార్ల ఫ్యాక్టరీలను నిర్మించుకోవాలి. ఇప్పుడు సౌత్ కరోలినాలో అదే జరుగుతోంది" అని ఆయన వివరించారు. ఈ విధానం వల్ల దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ విధానాల వల్ల అమెరికాలోకి సుమారు 19.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని ట్రంప్ తెలిపారు. దేశవ్యాప్తంగా వందల, వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు నిర్మిస్తుండటంతో నిర్మాణ రంగంలో ఉద్యోగాలు భారీగా పెరిగాయని అన్నారు. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలిస్తే తాను తెచ్చిన పన్ను, వాణిజ్య విధానాలు తలకిందులవుతాయని, పన్నులు పెరిగి, ఉద్యోగాలు పోతాయని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్లో రిపబ్లికన్ల నియంత్రణ కొనసాగేందుకు తమ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.