72 ఏళ్ల వయసులో సాహ‌సం.. యూరప్‌లో ఎత్తైన మంచు శిఖరాన్ని అధిరోహించిన విజయవాడ తాత!

Lingam Ravindra Rao 72 year old Vijayawada man scales Europe highest peak Mount Elbrus
  • విజయవాడకు చెందిన 72 ఏళ్ల రవీంద్రరావు సాహస యాత్ర
  • యూరప్‌లో ఎత్తైన ఎల్‌బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన వైనం
  • 17 ఏళ్ల మనవడు అనురాగ్‌తో కలిసి ఈ ఘనత సాధించిన తాత‌
  • వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపించిన వృద్ధుడు
వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తూ, విజయవాడకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు అరుదైన ఘనత సాధించారు. తన 17 ఏళ్ల మనవడితో కలిసి యూరప్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఆయన చాటిచెప్పారు.

విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు (72), ఆయన మనవడు అనురాగ్ పోకూరి (17) కలిసి యూరప్‌లోని మౌంట్ ఎల్‌బ్రస్ వెస్ట్ పీక్‌ను అధిరోహించాలని నిర్ణయించుకున్నారు. 5,642 మీటర్ల (18,510 అడుగుల) ఎత్తు ఉండే ఈ మంచు శిఖరాన్ని ఈ నెల 14వ తేదీన విజయవంతంగా అధిరోహించారు. తాతా-మనవళ్లు కలిసి సాధించిన ఈ సాహస యాత్ర ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనురాగ్ పోకూరి, ప్రముఖ సినీ నిర్మాత, ‘ఈతరం ఫిల్మ్స్’ అధినేత పోకూరి బాబూరావుకు కూడా మనవడు కావడం విశేషం. 

ఏడు పదుల వయసు దాటినప్పటికీ, సరైన ఆరోగ్య సూత్రాలు, మంచి ఆహారం పాటిస్తే ఇలాంటి సాహసాలు చేయడం సాధ్యమేనని రవీంద్రరావు నిరూపించారు. ఆయన సాధించిన ఈ ఘనతపై పలువురు అభినందనలు తెలుపుతూ, ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసిస్తున్నారు.
Advertisement
Lingam Ravindra Rao
Mount Elbrus
Anurag Pokuri
Pokuri Babu Rao
Vijayawada
Mountaineering

More Telugu News