విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవం.. విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి పతకాలు అందించిన మంత్రి లోకేశ్
- విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
- పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి
- ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరిస్తూ సాగిన శకటాల ప్రదర్శన
- అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు
- విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి పతకాలు అందజేత
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి వ్యక్తిగతంగా పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తున్న వారిని గుర్తించి గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో శనివారం జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణంలో, అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేశ్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, హోంగార్డ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, యూత్ రెడ్ క్రాస్ సహా పలు విభాగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కవాతును పర్యవేక్షించి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, ప్రగతిని ప్రతిబింబిస్తూ వ్యవసాయం, వైద్యం, విద్య, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, అటవీ, రవాణా, పౌర సరఫరాలు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖల శకటాలు కనులవిందు చేశాయి. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, ఏపీ విపత్తు స్పందన దళం, విజయవాడ నగరపాలక సంస్థ, పోలీస్ కమిషనరేట్ డ్రోన్ నిఘా విభాగం శకటాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.
అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలకు చేసిన నృత్యాలు, విన్యాసాలు ఆహూతులను అలరించాయి. చిన్నారుల ప్రదర్శనలు స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపాయి. కార్యక్రమం ముగింపులో, ముందుగా ప్రకటించిన విధంగా వివిధ శాఖలలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని మంత్రి నారా లోకేశ్ పేరుపేరునా అభినందించి, వారికి పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో శనివారం జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణంలో, అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేశ్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, హోంగార్డ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, యూత్ రెడ్ క్రాస్ సహా పలు విభాగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కవాతును పర్యవేక్షించి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, ప్రగతిని ప్రతిబింబిస్తూ వ్యవసాయం, వైద్యం, విద్య, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, అటవీ, రవాణా, పౌర సరఫరాలు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖల శకటాలు కనులవిందు చేశాయి. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, ఏపీ విపత్తు స్పందన దళం, విజయవాడ నగరపాలక సంస్థ, పోలీస్ కమిషనరేట్ డ్రోన్ నిఘా విభాగం శకటాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.
అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలకు చేసిన నృత్యాలు, విన్యాసాలు ఆహూతులను అలరించాయి. చిన్నారుల ప్రదర్శనలు స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపాయి. కార్యక్రమం ముగింపులో, ముందుగా ప్రకటించిన విధంగా వివిధ శాఖలలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని మంత్రి నారా లోకేశ్ పేరుపేరునా అభినందించి, వారికి పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




